👉అక్రమంగా ఇసుక నిల్వ చేసిన ట్రాక్టర్ యజమాని కి రూ10వేల జరిమాన విధించిన తహశీల్దార్ బాబ్జి
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండల తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ కోవిడ్ సమయం లో సైతం అహర్నిశలు శ్రమిస్తున్నారు. మండలం వ్యాప్తంగా ఇంటింటికి రెండవ దపా సర్వే లు నిర్వహిస్తూ వాటిని పరిశీలిస్తు, కోవిడ్ వచ్చిన వారిని హోమ్ క్వారంటైన్ లో ఉండవలసినదిగా సూచిస్తూ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారి ఇండ్లకు పోస్టర్లు అంటించే ప్రక్రియను ముందుండి నడిపించారు.తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ తో పాటు ఎం పి డి ఓ, ఎం పి ఓ పాల్గొన్నారు.మరొక వైపు ఇసుక అక్రమార్కులపై కొరడాజులిపించి గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మంగపేట మండల తహసీల్దార్ మల్లూరు గ్రామంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో జి సురేష్ కుమార్ ట్రాక్టర్ టి ఎస్ 25 ఈ 3582 పట్టుకొని, అతను అక్రమంగా పదమూడు ట్రాక్టర్ల ఇసుకను నిల్వ చేయడం వలన అతనికి పదివేల రూపాయలు జరిమానా విధించడం జరిగింది అని ఈ సందర్బంగా తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ పత్రికా ప్రకటన లో పేర్కొన్నారు.
Post A Comment: