మన్యంటీవీ,అశ్వారావుపేట: పేరాయి గూడెం గ్రామ పంచాయతీ లో మండల తహసీల్దార్ చల్లా ప్రసాద్, సర్పంచ్ నార్లపాటి సుమతి ఆధ్వర్యంలో కరోనా నివారణ కొరకు, ఇంటింటికి తిరిగి కరోనా హెల్త్ సర్వే నిర్వహించడం జరిగింది. అనంతరం కుటుంబాలలో ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ, కరోనా వైరస్ పట్ల జాగ్రత్త వహించాలని అవగాహనా చెయ్యడం జరిగింది. దగ్గు జలుబు జ్వరం లక్షణాలు ఉన్న వాళ్లను గుర్తించి ప్రభుత్వ హాస్పిటల్ కు పరీక్షలకు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డ్ మెంబెర్స్, అంగన్వాడి టీచర్స్, ఆర్ఐ, విఆర్ఓ, పంచాయితీ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: