CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తిరుమలకుంటలో కరోనా వ్యాప్తిపై సర్వే నిర్వహణ

Share it:

 




 

 మన్యంటీవీ,అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం తిరుమలకుంట పంచాయితీ పరిధిలో రోజు రోజుకు అధికం అవుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పంచాయితో ఆవాస ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. ప్రతీ కుటుంబంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తిరుములకుంట మాజీ సర్పంచ్, ప్రస్తుతం సర్పంచ్ భర్త సున్నం రామ లక్ష్మయ్య, ఉపసర్పంచ్ జుజ్జూరి రాంబాబు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ డాక్టర్ ఎం.వి రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నేపధ్యంలో మండల స్థాయి అధికారుల ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో పారిశుధ్యం పనులు పూర్తి చేయాలని, కోవిడ్ బాధితులను గుర్తించి వారికి తక్షణ వైద్య సదుపాయం అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అశ్వారావుపేట మండల పరిధిలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నందున విఓ, విఓఏ, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు తమ తమ ప్రాంతాల్లోని సర్వే చేసి అనుమానితులను వ్యాధి నిర్ధారణ చేసి ఉన్నవారిని గుర్తించి చికిత్స మరియు వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అశ్వారావుపేట మండలం తిరుమలకుంట పంచాయతీలో ఉపసర్పంచ్ జూబ్ధురి రాంబాబు నేతృత్వంలో గురువారం ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరోనా వ్యాప్తి, కోవిడ్ నివారణపై ఇంటింటికి తిరిగి తెలియజేసారు. సర్వే నిర్వహించి కరోనా లక్షణాలున్న వ్యక్తులను గుర్తించడం చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: