మన్యంటీవీ,అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో నారంవారిగూడెం - రామచంద్రపురం గ్రామాల మధ్య అశ్వారావుపేట సత్తుపల్లి రాష్ట్ర రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ద్విచక్ర వాహనంనీ ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో జీలుగుమల్లి మండలం, తాటాకుల గూడెం గ్రామానికి చెందిన పింగిళి దుర్గారావు (40) దుర్మరణం పాలయ్యాడు, నరసింహారావు 35 స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రులను నారం వారిగూడెం ఉప సర్పంచ్ సురేష్ నాయుడు దగ్గర ఉండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Post A Comment: