శ్రామిక శక్తి ఎంప్లాయిస్ అండ్ బదిలీస్ యూనియన్ డిమాండ్
మన్యం టీవీ,బూర్గంపాడు:
కరోనా మహమ్మారితో గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో ఓ ప్రవైట్ హాస్పటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఐటీసీ పర్మనెంట్ కార్మికుడు శుశీల్ కుమార్ షా తండ్రి బల్ దేవ్ కుటుంబాన్ని శనివారం ఉదయం శ్రామిక శక్తి ఎంప్లాయిస్ అండ్ బదిలీస్ యూనియన్ - టిఆర్ఎస్ కేవీ యూనియన్ ప్రెసిడెంట్ సానికొమ్ము శంకర్ రెడ్డి పరామర్శించి..వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. అనంతరం యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ.ఇటీవల ఐటీసీ-పీఎస్పీడీ లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపొందిన యూనియన్ వారు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కరోనా మహమ్మారితో చనిపోయిన కార్మికుడి కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని గెలుపొందిన యూనియన్ వారిని డిమాండ్ చేశారు. అలాగే కంపెనీలో కూడా చనిపోయిన కార్మికుడికి వచ్చే బెన్ ఫీట్స్ కూడా వర్తింప చేయాలని కోరారు...ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు షేక్ అజీమ్,ఎన్. మధు మహరాజ్, వి.ఆదినారాయణ,ఐ.గోపాల్, గద్దల.నాగేశ్వరరావు,దోసపాటి.సురేష్,వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: