CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

త్రాగునీరు కోసం రెండు కిలోమీటర్ల దూరం కాలినడక

Share it:

 


గుక్కెడు త్రాగునీరు కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్న వాలస ఆదివాసీ గ్రామం అశ్వపూరం పాడు

మన్యం టీవీ కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలపరిదిలోని వాలస ఆదివాసీ గిరిజన గ్రామం అశ్వపూరం పాడు గ్రామంలో త్రాగడానికి గుక్కెడు నీరు లేక మండు టెండలో సుమారు రెండు కిలోమీటర్ల దూరం కాలినడక చిన్న పిల్లలను సంకల ఎత్తు కోని త్రాగునీరు తెచ్చుకుంటున్నారు.మాకు గుక్కెడు త్రాగునీరు నీరు ఇచ్చె  అధికారులే కరువయ్యరు అంటు  మన్యం టీవీ కి ముందు వారు వాపోయారు.అనంతరం వారిని పలకరించగా మా గ్రామనికి త్రాగునీరు కోసం పైపులైను వేసి మూడు నెలలు గడుస్తున్న నేటికి గుక్కెడు త్రాగునీరు అందించిన అధికారే కరువయారు అంటు ఆవేదన వ్యక్తం చేశారు. మండుటు వేసవికాలం కావడంతో కాలినడక చిన్నపిల్లలను చంక ఎత్తుకోని సూమరు రెండు కిలోమీటర్ల దూరం కలినడకన వెల్లి త్రాగునీరు తెచ్చుకోవలసి వస్తుంది. వలస ఆదివాసీ గిరిజన గ్రామలు అంటే అధికారులకి అంత చులకనగా కనబడుతున్నమా అని ప్రశ్నించారు. అలాగే కరెంటు సౌకర్యం లేకా రాత్రిపూట సమయంలో పాములు ,తేళ్ళు వివిధరకాల విష సర్పల భయంతో ఉండవలసి వస్తుందన్నారు. మా గ్రామని అధికారు సందర్శించి త్రాగునీరు, కరెంట్, రోడ్డు సౌకర్యం కలిపించగలరని అశ్వపూరం పాడు ప్రజాలు అధికారులను వేడుకుంటున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: