CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భరోసా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అరిఫా రోష్ని వృద్ధాశ్రమానికి 100కేజీల బియ్యం, వితరణ

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని భరోసా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అశ్వాపురం మండలం,జగ్గారం గ్రామంలోని అరిఫా రోష్ని వృద్ధాశ్రమానికి సోమవారం 100కేజీల బియ్యం అందచేశారు.ఈ సంధర్భంగా కేపీయూజీ మైన్,ఎస్ఎంఎస్ ప్లాంట్ ఇంచార్జి,కార్యక్రమ దాత గుడివాడ శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో భరోసా కమిటీ ముందుకొచ్చి అనేకమందికి పలు రకాలుగా సేవ చేయడం అభినందించాల్సిన విషయమన్నారు.అందులో భాగంగా 100కేజీల బియ్యం, పండ్లు,మాస్కులను అందచేశామన్నారు.భవిష్యత్తు లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొనాలని ఆశిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఓసీ2 అధికారులు రాముడు, లింగబాబు,మదార్ సాహెబ్, వృద్దాశ్రమం నిర్వాహకురాలు అరిఫా, కమిటీ సభ్యులు అమీనుద్దీన్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: