మన్యం టీవీ,బూర్గంపాడు :
తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆధ్వర్యంలో పాల్వంచ అడిషనల్ ఎస్పీ ఆర్ కె ప్రసాద్ పర్యవేక్షణలో సిఐ మరియు బూర్గంపాడు ఎస్ ఐ జితేందర్ మండలం లోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలకు ప్రజల సహకారం అందించాలని లేనియెడల కఠిన చర్యలు తప్పవని లాక్ డౌన్ పరిస్థితుల గురించి మైకు పెట్టి ఆటో ద్వారా మండలంలోని అన్ని ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై లాక్ డౌన్ ఉల్లంఘన చట్టం కింద కేసులు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.
Post A Comment: