👉లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై యాక్టుల ప్రకారం 12 కేసులు,497 ఈ - పెట్టీ కేసులు నమోదు
36 వాహనాలను సీజ్ చేసినట్లుగా వివరాలను వెల్లడించిన మణుగూరు ఏఎస్పీ శబరీష్ ఐపీఎస్.
మన్యం టీవీ మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా పది రోజులపాటు విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మణుగూరు ఏఎస్పీ శబరీష్ ఐపీఎస్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇప్పటి వరకు మణుగూరు సబ్ డివిజన్లో గల నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, జరిమానాలను విధించడం లాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ లోని పోలీస్ అధికారులు అందరూ అన్ని ప్రదేశాలలో మరియు గ్రామాల్లో నిత్యం పెట్రోలింగ్ మరియు వాహన తనిఖీలు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.మణుగూరు సబ్ డివిజన్లో ఇప్పటివరకు మాస్కులను ధరించని 1697 వ్యక్తులకు జరిమానా విధించడం జరిగింది అన్నారు.లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 12 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.36 వాహనాలను సీజ్ చేసి,497 ఈ-పెట్టీ కేసులను నమోదు చేయడం జరిగింది అని తెలిపారు.కావున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ, అనుమతించిన సమయం లో నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు రావాలని కోరారు.లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి, పోలీస్ వారు తీసుకునే చర్యలకు గురి కావద్దని విజ్ఞప్తి చేశారు.
Post A Comment: