CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ వితరణ

Share it:


మన్యం టీవీ, మణుగూరు:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం "ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ" వారి ఆధ్వర్యంలో మణుగూరు మండలం గాంధీ బొమ్మ సెంటర్ లోని ఎవరు లేని ఎటువంటి ఆసరా లేని , ప్రమాదవశాత్తూ నడుములు విరిగి , మంచం లో పడి , నడవలేక , పనిచేసుకొని జీవించలేక , కొట్టుమిట్టాడుతున్న కేత చంద్రయ్య పరిస్థితి తెలుసుకున్న "ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ " వారు వారికి 25 కేజి ల బియ్యం , నిత్యావసర వస్తువులు మరియు కూరగాయలు , దుస్తులు అందచేయడం జరిగింది .

ఈ కార్యక్రమంలో" ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ" అధ్యక్షులు గుగులోత్ రాందాస్ నాయక్ , ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ , కోశాధికారి గుగులోత్ రమేష్ , ప్రచార కార్యదర్శి పరాల మల్లయ్య యాదవ్ , ముఖ్య సలహాదారులు బుర్రా సత్యనారాయణమూర్తి గారు తదితరులు పాల్గొన్నారు.

Share it:

SLIDER

Post A Comment: