మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం భద్రాచలం పరిధిలో గల సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు మీటింగ్ లో తెలంగాణ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టడం ఎంతో ఆనందకరం అని ఆయన అన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ మీటింగ్ హాల్లో మనం సుమారుగా 20 నిమిషాల నుంచి ఉండగా మనకే చెమటలు పట్టి ఇబ్బందిగా అనిపించింది అలాంటిది డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది వారు సుమారు ఎనిమిది గంటల నుంచి 12 గంటల దాకా పి పి సి కిట్లు గ్లౌజులు మాస్కులు మరియు వేసుకొని వారు చేస్తున్న సేవ అభినందనీయం అని ఆయన పేర్కొన్నారు. మన కరోనా వచ్చిందని తెలిసినా వారు మనకు వైద్యం చేసి బ్రతికించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వైద్య సిబ్బందిని అభినందించారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే 6 మెడికల్ కాలేజీలో 1 మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కు సాంక్షన్ చేయడం ఎంతో ఆనందకరం అని ఆయన వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న గిరిజనులు అందరూ బాగా చదువుకొని అందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. మెడికల్ కాలేజ్ ఇక్కడ సాంక్షన్ అవ్వడం వల్ల జిల్లాలో ఉన్న గిరిజనుల కి మెడికల్ చదువుకోడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కరోనా కష్టకాలంలో డాక్టర్ ఎం.వి రెడ్డి జిల్లా కలెక్టర్ ఎంతో చొరవ తీసుకుని తక్షణమే స్పందించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్న ఆయనకి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శాలువా కప్పి అభినందించారు. ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మరియు కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: