మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం భద్రాచలం పరిధిలో గల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో ఈరోజు ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ మరియు అదేవిధంగా లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించడం జరిగింది. ఆస్పత్రిలో కరోనా పేషెంట్లు దృష్ట్యా ఆక్సిజన్ కొరత రాకూడదని ప్రభుత్వం ఆక్సిజన్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సుమారు రెండు వందల పడకల పైచిలుకు గల ఆసుపత్రిగా మరియు చుట్టుపక్కల ఆంధ్ర ఒడిశా మరియు చతిస్గడ్ మరియు అనేక రోగులు ఇక్కడకు వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం భావించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ,ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.వి రెడ్డి. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మండల్ పరిషత్ కోరం కనకయ్య, జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, అనుదీప్, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు, డి ఎం హెచ్ ఓ శిరీష, డిస్ట్రిక్ట్ సర్వే ఆఫీసర్ చేతన్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: