మన్యం టీవీ భద్రాచలం: భద్రాచలం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిధిలో గల సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు ఈరోజు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆరోగ్య శాఖ అధికారులతో మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో ప్రతి అధికారి ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం మండలం మణుగూరు మండలం అశ్వారావుపేట మండలం ములకలపల్లి కొత్తగూడెం మండలం మరియు అన్ని మండలాలు కరోనా పాజిటివ్ ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఎంత రికవరీ రేటు వచ్చింది అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రెమిడీసివర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయా లేదా మరియు కరోనా రోగులకు ఎన్ని ఇంజెక్షన్లు వేస్తున్నారు మరియు వారి రికవరీ రేటు ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ ఆసుపత్రికి రెమిడీసివర ఇంజక్షన్లు ఎన్ని పంపుతున్నారు , వాటిని ఎమ్మార్పీ ధర కంటే అధిక రేటు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరియు ప్రతిరోజు ప్రైవేటు ఆసుపత్రులపై మోనిటరింగ్ చేయాలని మంత్రి పువ్వాడ కలెక్టర్లకు ఆదేశించారు.
Navigation
Post A Comment: