పలువురికి ఆదర్శంగా నిలిచిన యాకూబ్ పాషా
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని భూపాలపట్నం పంచాయతీ ఐలాపురం గ్రామానికి చెందిన యాకూబ్ పాషా కరోనా రోగుల కొరకు ప్లాస్మా దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. ఏడూళ్ల బయ్యారం ఎక్స్ రోడ్ లో చికెన్ షాపు నిర్వహించే యాకూబ్ పాషా 27 రోజుల నుండి రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తూ అల్లాను కొలుస్తున్నాడు. అయినప్పటికీ ఉపవాస దీక్షను లెక్క చేయకుండా, కరోనా రోగులకు రోగనిరోధక శక్తిని పెంచే ప్లాస్మాను తన రక్తం ద్వారా అందించాలనే సదుద్దేశంతో మణుగూరు లో నిర్వహించిన హెల్త్ క్యాంపు కు హాజరై, స్వచ్ఛందంగా రక్తదానం చేశాడు. యాకూబ్ పాషా చేసిన పని పట్ల మండలంలోని పలువురు వ్యక్తులు సంతోషం తెలియజేసి, అతని గొప్ప మనసును కొనియాడుతున్నారు. మూడు పూటలా పౌష్టిక ఆహారం తీసుకుని, రక్త దానం చేస్తే ఏమవుతుందోనని భయపడే ఈ రోజులలో ఉపవాస దీక్షలు చేస్తూ, ప్లాస్మా దానం చేయడం చాలా గొప్ప విషయం అని పినపాక మండల ప్రజలు అతని యొక్క గొప్పతనాన్ని గురించి చర్చించుకుంటున్నారు.
Post A Comment: