మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు లోని భరోసా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద శ్రామికులకు,పారిశుద్ధ్య కార్మికులకు,చిరు వ్యాపారులకు నాణ్యమైన మాస్కులను అందచేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సమితి సింగారం ఉపసర్పంచ్ పుచ్చకాయల శంకర్ మాట్లాడుతూ,ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.ఇటువంటి తరుణంలో భరోసా కమిటీ సభ్యులు ముందుకు వచ్చి అత్యంత నాణ్యమైన మాస్కులను ప్రత్యేకంగా తయారుచేయించి ఉచితంగా పేదవారికి అందచేయడం అభినందనీయమన్నారు.భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అమీనుద్దీన్, సింగరేణి కార్మికుడు యూసఫ్. తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: