మన్యం టీవీ గుండాల; అభివృద్ధి మాటున ఇసుకను తరలించేందుకు ఇసుక మాఫియా ప్రయత్నాలను ప్రారంభించింది. గుండాల ఆళ్ల పల్లి మండలాల్లో కిన్నెరసాని నది ప్రవహిస్తుంది ప్రతి ఏటా పెద్ద మొత్తంగా ఇసుక మేటలు ఏర్పడతాయి. ఆ ఇసుకను అక్రమంగా తరలించేందుకు అభివృద్ధి పనుల మాటున ఇసుక మాఫియా ప్రతియేటా వందల క్యూబిక్ మీటర్లను అక్రమంగా తోడేసి లక్షల రూపాయలను దండుకుంటున్నారు, ఆళ్ల పల్లి గుండాల సరిహద్దు లో గల కిన్నెరసాని నది లో ఇసుక ర్యాంపు లను ఏర్పాటు చేసి ఇసుకను అక్రమ పద్ధతిలో తరలిస్తుంటారు అనుమతులు అరకొరగా తెచ్చుకొని పరిమితులను మించి ఇసుకను పొడుస్తూ నది ని ఖాళీ చేస్తున్నారు నదిలో వాహనాలు జెసిబి లు దింపి ఇసుకను తోడు తున్నారు గతంలో అక్రమ పద్ధతిలో ర్యాంపులు నిర్వహిస్తుండగా సంబంధిత అధికారులు వాహనాలను సీజ్ చేశారు మళ్లీ అదే పద్ధతిలో ఇసుకను తరలించేందుకు ఇసుక మాఫియా ప్రయత్నాలను ప్రారంభించింది. అధికారులు అక్రమ పద్ధతిలో తరలించాలని ప్రయత్నాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుకుంటున్నారు
Post A Comment: