మన్యం టీవీ, పాల్వంచ :-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో రూరల్ పోలీసుస్టేషన్ కిన్నెరసాని లో
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్ రవీందర్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ దాసరి భాస్కర్ రావు జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాస రావు ఆధ్వర్యంలో పోలీస్, మీడియాకు శానిటైజర్ మాస్కులు పంపిణీ...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి లో భాగంగా విధించిన లాక్ డౌన్ అమలులో కీలక పాత్ర పోలీస్ వారిదే...24/7 విధినిర్వహణలో ఉంటూ లాక్ డౌన్ అమలను పగడ్బందీగా నిర్వహిస్తున్నారు..
ఎప్పటికప్పుడు లాక్ డౌన్ కు చెందిన ప్రతి వార్తను మీడియా కవర్ చేస్తూ విధి నిర్వహణలో తనదైన పాత్ర పోషిస్తున్నారు....
కరోనా మహమ్మారి కి ఎందరో మరణిస్తున్న విధినిర్వహణలో తమ వారిని కోల్పోతున్న మొక్కవోని ధైర్యంతో పోలీస్ మీడియా విధి నిర్వహణ నిర్వహిస్తున్నారు...
జిల్లా వ్యాప్తంగా పోలీస్ మీడియా వారికి శానిటైజర్ మాస్కులు పంపిణీ చేయటానికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ లకు మీడియా మిత్రులకు శానిటైజర్ మాస్కులు పంపిణీ చేశారు పారిశుద్ధ్య కార్మికులకు రెవిన్యూ సిబ్బందికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాసరావు అన్నారు.
Post A Comment: