CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా నియంత్రణకై కదం తొక్కిన మహిళా మణులు...

Share it:

 



టీఆరెస్ పార్టీ 14వ వార్డ్ కౌన్సిలర్ మహ్మద్ అఫ్జల్ ఉన్నిసా బేగం...


మన్యం టీవీ పాల్వంచ :-

ఈ రోజు స్థానిక భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని చమన్ బస్తీ, బాబుక్యాంపు 14వ వార్డ్ నందు టీఆరెస్ పార్టీ వార్డ్ కౌన్సిలర్ అఫ్జల్ ఉన్నిసా బేగం గారి ఆధ్వర్యంలో కరోన మహమ్మారి కట్టడిలో భాగంగా ఇంటింటి జ్వర సర్వే నిర్వహించడం జరిగింది...

ఈ కార్యక్రమానికి 14వ వార్డ్ కౌన్సిలర్ అఫ్జల్ ఉన్నిసా గారి పిలుపు మేరకు తెలంగాణ అంబేద్కర్ మహిళ సంఘం నాయకురాళ్లు మాట్ల గాయత్రి, కెడెం కృపావేణి, నక్కా సృజన పాల్గొనడం జరిగింది...

ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ మరియు మహిళ సంఘం నాయకురాళ్లు మాట్లాడుతూ ప్రస్తుతం మన భారత దేశం, తెలంగాణ రాష్ట్రం ఈ కరోనా మహమ్మారి కారణంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది అని దీనిని ఎదుర్కోవడానికి ప్రతిఒక్కరు సెల్ఫ్ డిస్టెన్స్ పాటిస్తూ, మాస్కులు దరిస్తూ, శానిటైజర్స్ తో చేతులను శుభ్రంగా కడుక్కుంటు తగు జాగ్రత్తలు తీసుకోవల్సిందిగా ఎవరికి వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి మనము మనతో పాటు ఇతరులను కాపాడే దిశగా మానవ ప్రయత్నం చెయ్యాలి అని,అలా చెయ్యని యెడల మన కుటుంబ సభ్యులను మరియు ఎందరో ఆత్మీయ మిత్రులను కోల్పోవలసి వస్తుంది అని చెప్పడం జరిగింది.

వార్డ్ లోని ప్రతి ఇంటిని సందర్శించి వారి మంచి చెడు లను కనుక్కోని కరోన సింటమ్స్ ఉన్నవారికి,వారి ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేస్తూ అవసరాన్ని బట్టి కరోన మెడిసిన్ కిట్లు అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ పద్మావతి, ర్ప.దివ్య, రమ, బుజ్జి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: