మన్యం టీవీ, ఇల్లేందు:
భద్రాద్రి జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడెం,ఏడ్పుల గూడెం లలో సుమారు పందొమ్మిది మంది రైతులకు చెందిన ముప్పై ఎకరాల భూమిలో సాగుచేసుకొనివ్వకుండా ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకుంటున్న విషయాన్ని స్థానిక సర్పంచ్ చింతా రజిత జిల్లా పరిషత్ చైర్మన్ గారి* దృష్టికి తీసుకురాగా,పోడు భూముల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామని అప్పటివరకూ రైతులను ఇబ్బందులకు గిరిచేయొద్దు అని ప్రకటించినప్పటికి, జిల్లాలో కొంతమంది ఫారెస్ట్ అధికారులు కావాలనే గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని,ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోకుండా ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేక వచ్చే విధంగా ప్రవర్తించే అధికారులను ఉపేక్షించేదిలేదని ఫారెస్ట్ సిబ్బందిని హెచ్చరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ గౌ,,శ్రీ.కోరం కనకయ్య.
ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చింతా రజిత,మాజీ సర్పంచులు చింతా ఉదయ్,కాంతారావు, మాజీ ఎంపీటీసీ పూనెం పగడయ్య,
*ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుక్కి,బీట్ ఆఫీసర్ సీత,శ్రీలత* తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: