మన్యం టీవీ ఏటూరు నాగారం:
ఆలయాలు,మసీదులు, చర్చిలు వంటి ప్రార్థన మందిరాలలో లాక్ డౌన్ నిబ్బందులను విధిగా పాటించాలని సిఐ కిరణ్ కుమార్ ఆదేశించారు. బుధవారం అయన ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్లో ప్రార్ధనా మందిరాల నిర్వాహకులతో సమీక్షించారు.సామూహికంగా పూజలు, ప్రార్థనలు చేయవద్దన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కరోనా కట్టడిలో ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించవలసిందిగా కోరారు.నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మత పెద్దలు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: