నిబంధనలు ప్రజలు తూచ తప్పకుండ పాటించాలి-తహసీల్దార్ బాబ్జి ప్రసాద్.
మన్యం టీవీ మంగపేట.
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం పదిరోజుల లాక్ డౌన్ ఉత్తర్వులు ఇచ్చింది.కావున ప్రజలు నిత్యావ సరాల కొరకు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఉదయం 6 గంటలనుండి ఉదయం పది గంటల వరకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయవలసినదిగా మంగపేట తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ సూచించారు.పది గంటలకు అన్ని దుకాణాలు మూసివేసి ప్రభుత్వానికి సహకరించవలసిదినదిగా విజ్ఞప్తి చేశారు.ప్రజలు ఎవరు కూడా అనవసరంగా బయటకు రావొద్దని అత్యవసర పరిస్థితిలో అయితే జాగ్రత్తలు పాటించాలని, వివాహలకు 40 మందికి మించి అనుమతి లేదని ఈ సందర్బంగా తెలియజేసారు.విందులు వినోదా లంటూ యువత బయటకు వచ్చి నిబంధనలు ఉల్లంఘిస్తె వారిపై జాతీయ విపత్తు నివారణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోబడును అని మంగపేట తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ సూచించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే టెస్టుల కోసం ఎదురు చూడకుండా మీకు సమీపంలో ఉన్న ఆశా వర్కర్స్, లేదా ఏ ఎన్ ఎం ల కు తెలియజేసి వారి సలహా మేరకు మెడికల్ కిట్స్ తీసుకొని మందులు సకాలంలో వాడాలని పేర్కొన్నారు. రెండవ డోస్ వాక్సిన్ కోసం సంబంధిత మెడికల్ ఆఫీసర్ ను సంప్రదించాలని అత్యవసర పరిస్థితి లో తప్ప బయటకు రావొద్దు లాక్డౌన్ నిబంధనలు ప్రజలు పాటించి కరోనా ఉదృతిని తగ్గించాలంటూ ఈ సందర్బంగా తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ హితవు పలికారు.
Post A Comment: