ఓకే గ్రామంలో 60 మందికి పైగా కరోనా లక్షణాలు
గుండాల మే 21( మన్యం టీవీ )కరోనాతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది మండలం పరిధిలోని శంభుని గూడెం గ్రామానికి చెందిన వట్టం రుక్మిణి 35 గత వారం రోజులుగా కరోనాతో బాధపడుతూ 4 రోజుల క్రితం ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వారం రోజుల క్రితం రుక్మిణి అత్తగారు కరోనాతో మృతి చెందింది ఇప్పటికి శంభుని గూడెం గ్రామంలో 60 మందికి పైగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు గుండాల వచ్చి కరోనా పరీక్ష చేయించుకోవడానికి రవాణా సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మన్యం టీవీ
Post A Comment: