👉జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్.
మన్యం మీడియా కొత్తగూడెం
మావోయిస్టు పార్టీలోని కొంతమంది నాయకులు మరియు దళ సభ్యులు కరోనా వైరస్ బారిన పడి వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు మాకు విశ్వసనీయ సమాచారం అందినది.కరోనా కారణంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ నాయకులు మరియు దళ సభ్యులు ఎవరైనా వైద్య సదుపాయాలను పొందడానికి మావోయిస్టు పార్టీ నుండి బయటకు వచ్చి పోలీసువారి సహాయం పొందవలసినదిగా కోరుతున్నాము. మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు క్రింది స్థాయి నాయకులను మరియు సభ్యులను మెరుగైన వైద్యం పొందడానికి నిరాకరించిన యెడల,అట్టి వారు వెంటనే మావోయిస్టు పార్టీని వీడి బయటకు వచ్చి పోలీసు వారి సహాయం పొందవలసినదిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేడు ఒక ప్రకటనలో తెలియజేశారు.
Post A Comment: