మండలంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా మృతులు
గుండాల ( మన్యం టీవీ) కరోనాతో వృద్ధుడు మృతి చెందిన సంఘటన చోటు చోటు చేసుకుంది. మండలం పరిధిలోని పోతి రెడ్డి గూడెం గ్రామానికి చెందిన ఈ సం ముత్తయ్య ( 60) కరోనాతో బాధపడుతూ బుధవారం మృతి చెందాడు. ముత్తయ్య కు కరోనా నిర్ధారణ పరీక్షలలో పాజిటివ్ రావటంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ప్రవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్సను అందించారు. పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకు వచ్చారు బుధవారం మధ్యాహ్నం కరోనాతో బాధపడుతూ మృతి చెందాడు. గుండాల నుండి ఎంపీటీసీ ఎస్కే సంధాని, ఉప సర్పంచ్ మానాల ఉపేందర్ , పీ పీ కిట్లు తీసుకు వెళ్ళడంతో కుటుంబ సభ్యులు వాటిని ధరించి అంతిమ సంస్కారం నిర్వహించారు
Post A Comment: