భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
Press Note.
26.05.2021.
మన్యం టీవీ, పాల్వంచ:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖకు సంభందించి నిరుపయోగంగా ఉన్న పాత వస్తువులను విక్రయించేందుకు 03.06.2021 న వేలంపాట నిర్వహించనున్నామని ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలియజేసారు.ఆసక్తి గల కొనుగోలుదారులు తమ ఆధార్ కార్డుతో జూన్ 3వ తేదీన ఉదయం 10గంటల నుండి ప్రారంభం కానున్న వేలంపాట కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుశాఖలోని నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు,కంప్యూటర్ పరికరాలు,ఫర్నిచర్,పాత ఇనుము,రైన్ కోట్స్,షామియానాలు,టెంట్లు,వెబ్ ఆర్టికల్స్,పాత బ్యాటరీలు,హాండ్ కప్స్,పాలీ కార్బోనేట్ స్టోన్ గార్డ్స్,డ్రాగన్ లైట్స్,హెల్మెట్స్,బాడీ ప్రొటెక్టర్స్ మొదలగు ఇతర స్టోర్స్ వస్తువులను విక్రయించేందుకు ఈ వేలంపాట నిర్వహించనున్నామని తెలిపారు.
ఆసక్తి గల కొనుగోలుదారులు ఈ క్రింది నంబర్లకు సంప్రదించగలరు:
సి.హెచ్.ఎస్.వి.కృష్ణ (రిజర్వ్ ఇన్స్పెక్టర్)-9491088575
సూర్యనారాయణ (ఏఆర్ఎస్ఐ) -7901143227
కిషన్ (హెడ్ కానిస్టేబుల్)-9440554169
Post A Comment: