మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ఏరియా లోని సి టైప్ మరియు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పార్క్ నందు అవుట్ సోర్సింగ్ కార్మికులు గా విధులు నిర్వహిస్తున్న వారికి *భరోసా వెల్ఫేర్ సొసైటీ* కమిటీ సభ్యులు లింగాబాబు చేతుల మీదుగా నాణ్యతతో కూడిన మాస్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా లింగాబాబు మాట్లాడుతూ కరోనా నియంత్రణ లో మాస్క్ బ్రహ్మాస్త్రం లా పనిచేస్తుందని వారు వివరించారు.అలాగే కరోనా రెండవ దశలో మరణాల శాతం,మొదటి దశ కంటే ఎక్కువ శాతం గా నమోదవుతుందని తెలిపారు.కరోనా సోకిన వారు భయాందోళనకు గురి కావద్దని,భయాన్ని మించిన రోగం మరొకటి లేదని వారు వివరించారు.ఇటువంటి విపత్కర పరిస్థితులలో భరోసా వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమాజానికి తమ వంతు సాయంగా మాస్కుల పంపిణీ చేపట్టడాన్ని వారు కొనియాడారు.భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మరికొన్ని చేపట్టడం జరుగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో భరోసా వెల్ఫేర్ సొసైటీ కమిటీ సభ్యులు యం డి. అమీన్ ఉద్దీన్,రాజేష్,రవి, వాసు,క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: