గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా అందజేత.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం లో శుక్రవారం గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి పర్యటన సందర్భంగా ఆదివాసి గిరిజను లైనా తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి చెందిన ఢిల్లీ బొర్రయ్య ఇటీవల గుండెజబ్బుతో మరణించగా వారి కుటుంబానికి ట్రైబల్ రిలీఫ్ ఫండ్ కింద 25 వేల రూపాయల విలువ గల చెక్కును, అదేవిధంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం తుర్శవని గూడెం గ్రామానికి చెందిన బాడిస నగేష్ ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోవడంతో వీరికి కూడా ట్రైబల్ రిలీఫ్ ఫండ్ కింద 25 వేల రూపాయల విలువగల, చెక్కును మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఎంపీ మాలోతు కవిత, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఆదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, ఐటిడిఎ పిఓ హనుమంతు కె జండాగే, మరియు గిరిజన సంక్షేమ ఉపసంచాలకులు మంకిడి ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: