మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగుడెం జిల్లా
అశ్వాపురం మండలం మండలం లోని బుడుగు బజార్ గ్రామం లొ గట్ల నాగమణి మరియు కొండల్ రావు దంపతుల కుమారుడు గట్ల మహేశ్(23).కరోన వ్యాప్తి అదికంగా ఉన్నా కూడ నిత్యం కూలీ చేసుకునే కడు పేద కుటుంబం కావడం వలన తప్పనిసరి పరిస్తితుల్లొ ఓ గ్రామం లొ బిల్డింగ్ నిర్మాణం పనికి వెళ్ళగా దురదృష్టవశాత్తు గోడ కూలి మహేశ్ కుడి బుజం పై పడి బుజం లోని ఎముకలు విరిగి ఎటు వెళ్ళలేని నిస్సాహయ స్తితిలో ఉన్నాడు.కొడుకు కూలి చేస్తే గాని మూడు పూట్ల తినే కుటుంబం అయినందున విషయం తెలుసుకున్న తెలంగాణ గ్రామీణాభివృద్ది ఉధ్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి ప్రసాద్, కూతురు బచ్చలకూరి మృధుల యాదవ్, ఆ కుటుంబానికి సహాయార్థం 25 కేజీల బియ్యం మరియు వంట నూనె అందించడం జరిగింది.కార్యక్రమం లొ బచ్చలకూరి రమేష్, తదితరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: