మన్యం టీవీ ఏటూరు నాగారం: ములుగు జిల్లాలోని గోవిందరావు పేట మండలం కేంద్రములో పిఎసిఎస్ ,చల్వాయి గ్రామంలోని ఐ కె పి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య పరిశీలించారు.అనతరం ఆయనకు స్థానిక రైతు బంధు సమితి మండలం కోర్దినేటర్ మధుసూదన్ రెడ్డి, చల్వాయి, గోవిందరావు పేట గ్రామ కోర్దినేటర్స్,బొల్లం ప్రసాద్, శ్రీనివాసరావు స్థానిక రైతులు పల్లా బుచ్చయ్య పలు సమస్యలతో వినతి పత్రాన్ని అందచేశారు. సమస్యలలో రైస్ మిల్లర్లు రైతుల వద్ద కొనుగోలు చేసిన వడ్లలో క్వింటాకు సుమారుగా 5 నుండి10 కిలోల ను కటింగ్ పెట్టి రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని తమ గోడును విన్నవించుకున్నారు. అదేవిధంగా గా లారీలు సమయానికి రాక చాలా అవస్థలు పడుతున్నామని, గొనె సంచులు చినిగినవి ఇచ్చారు, అని వివరించారు. ఈ సందర్బంగా పల్లా బుచ్చయ్య మాట్లాడుతూ మీ సమస్యలు అన్ని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ ల గారితో మాట్లాడి తక్షణమే రైతులకు న్యాయం చేస్తానని పల్లా బుచ్చయ్య రైతులకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి దేశంలో ఎక్కడా లేని ఈ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది, అని అన్నారు. ప్రభుత్వ అధికారులు రైతులకు అండగా నిలిచి ప్రభుత్వానికి జిల్లాకు మంచి పేరు వచ్చే ఈ విధంగా అధికారులు కృషి చేయాలని మిల్లర్లు కూడా రైతుల పై కరుణ చూపాలని పల్లా బుచ్చయ్య అన్నారు.ఆయన వెంట స్థానిక తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: