CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఈటలపై మరో విచారణకు సీఎం ఆదేశం

Share it:




హైదరాబాద్ :మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం లో ముఖ్య మంత్రి కె. చంద్ర శేఖర్ రావు కు మరో ఫిర్యాదు అందింది. ఈటెల రాజేందర్ కుమారుడు ఈటెల నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారనీ,తనకు న్యాయం చేయాలని కోరుతూ, మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ అనే వ్యక్తి సీఎం కెసిఆర్ కు ఫిర్యాదు తో కూడిన దరఖాస్తు చేశారు. తనకందిన ఫిర్యాదు మేరకు తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఎసిబి విజిలెన్స్ శాఖ, రెవెన్యూ శాఖ, రెండు శాఖలు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సీఎం కెసిఆర్ ఆదేశించారు.

Share it:

TELANGANA

Post A Comment: