సర్వర్ పౌండేషన్ సభ్యులు
మన్యం టీవీ మంగపేట.
మంగపేట : పేద ప్రజలకు సాయం అందించడం కోసం సర్వర్ పౌండేషన్ ఏల్లవేళల ముందుటుందని సర్వర్ పౌండేషన్ సభ్యులు అన్నారు,మంగపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన మనోహారరావు, అండాలు వృద్ధ దంపతులకు కరోనా రావడంతో ఇబ్బందులు పడుతున్నారు, సర్వర్ చారిటబుల్ ట్రస్టు, పౌండేషన్ వ్యవస్థాపకురాలు, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ ఆదేశాల మేరకు కరోనా సోకిన వృద్ధ దంపతులకు సాయం అందించినట్లు పౌండేషన్ సభ్యులు తెలిపారు, అనంతరం వారు మాట్లాడుతూ అనాధ, అభాగ్యులకు పేద ప్రజలకు సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ ఎల్లవేళల తోడుగా ఉంటుందని వారు తెలిపారు,సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం నిత్యవసర సరుకులు అందించారు, ఈ కార్యక్రమంలో సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ సభ్యులు పండు, మురుకుంట్ల నరేందర్, కర్రీ నాగేంద్రబాబు,కట్ల శివరాజ్,సురేష్,జగదీష్,తదితరులు ఉన్నారు.
Post A Comment: