మన్యం టీవీ పాల్వంచ:- కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, గురు దక్షిణ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, విలువలతో కూడిన రాజకీయ జీవితం గడిపిన, రాజకీయ కురువృద్ధుడు, మేధావి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ సుపరిచితుడు, నాకు అత్యంత సన్నిహితుడు చేకూరు కాశయ్య మరణం నాకు దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. చేకూరి కాశయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు చింతా నాగరాజు,ఎస్వీకే చారి, దొమ్మేటి నాగేశ్వరరావు, ఎంఏ. మజీద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: