మన్యం టీవీ, గుండాల:
ఆదివాసి ముద్దుబిడ్డ సిపిఎం గుండాల మండల కార్యదర్శి కామ్రేడ్ జోగ నరసయ్య కు సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ గుండాల సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శిఅరెం నరేష్,జడ్పిటిసి వాగబోయిన రామక్క,సర్పంచ్ కొమరం సీతారాములు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
గుండాల మండలం తురుబాక గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి పాలక ప్రభుత్వాలు ఆదివాసీలకు చేస్తున్న అన్యాయాలను గుర్తించి మొదట విప్లవ పార్టీలతో, ఆ తర్వాత ఆదివాసి హక్కుల పోరాట సమితి( తుడుం దెబ్బ) ప్రస్తుతం సిపిఎం పార్టీ గుండాల మండల కార్యదర్శి గా పనిచేస్తూ ఈరోజు కరోనా మహమ్మారి కాటుకు బలైన కామ్రేడ్ జోగా నరసన్న కు విప్లవ జోహార్లు తెలిపారు.
గుండాల మండలం లో అఖిలపక్ష, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగిన పోడు భూముల ఉద్యమం, ఓపెన్ కాస్ట్ లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, పత్తి, మొక్కజొన్న తదితర పంటల రేట్లు పెంచాలని గుండాల మండలం లో వ్యాపారస్తూలతో జరిగిన చర్చల్లో తన వంతు పాత్రను పోషించారు.
పాలకవర్గ ప్రభుత్వాలు కరోనాను అరికట్టడంలో ఘోరంగా విఫలమయ్యాయి, ఈ కరోనా వైరస్ మూలంగా అనేకమంది ఉద్యమకారులు, పేద ప్రజలుతమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు.
ఎన్నికల పైన ఉన్న శ్రద్ధ పాలకులకు ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్న పట్టించుకోకపోవడం సిగ్గుచేటు.
ఈరోజు ఖమ్మం ఆస్పత్రిలో కరోనా మహమ్మారికాటుకు బలైన కామ్రేడ్ జోక్ నర్సయ్యకు జోహార్లు తెలియజేస్తూ వారి కుటుంబానికి, బంధుమిత్రులకు ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేశారు.
Post A Comment: