👉🏻ఓటమికి ఎవరూ నిరాశ పడొద్దు...
👉🏻 ఓటమి ఎప్పుడూ గెలుపుకు నాంది....
శ్రామిక శక్తి యూనియన్ అధ్యక్షులు సానికొమ్ము శంకర్ రెడ్డి
మన్యం టీవీ,బూర్గంపాడు:
ఐటీసీ-పీఎస్పీడీ భద్రాచలం యూనిట్ లో ప్రతిష్టాత్మకంగా జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో శ్రామిక శక్తి ఎంప్లాయిస్ అండ్ బదిలీస్ యూనియన్-టిఆర్ఎస్ కేవీ గుర్తు బాణం గుర్తు..బాణం గుర్తుపై ఓట్లేసి సహకరించిన ప్రతి ఒక్క కార్మికుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.. మంగళవారం నాడు శ్రామిక శక్తి ఎంప్లాయిస్ అండ్ బదిలీస్ యూనియన్ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి యూనియన్ ప్రెసిడెంట్ సానికొమ్ము శంకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ...శ్రామిక శక్తి యూనియన్ నాయుకులు-కార్యకర్తలు-అభిమానులు-కార్మికులు ఎవరూ కూడా ఓటమికి నిరాశ పడొద్దని ఓటమి ఎప్పుడూ గెలుపుకు నాంది అని అన్నారు. భవిష్యత్తులో శ్రామిక శక్తి యూనియన్ తప్పకుండా గెలుపొంది తీరుతుందన్నారు. ఓటమి పాలైనప్పటికి తామెప్పుడు కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతుందన్నారు. అలాగే గుర్తింపు పొందిన యూనియన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరుతూ.. వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కార్మికులు,శ్రామిక శక్తి యూనియన్ నాయకులు కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: