45 పైబడిన వారికి నేరుగా టీకాలు ఇవ్వాలి.
గుర్తింపు కార్డు ఉన్నవారికి రిజిస్ట్రేషన్ తో సంబంధం లేకుండా టీక వెయ్యాలి.
అందరికీ ఉచితంగా టీకా వేయాలి.
గార్లపాటి పవన్ కుమార్ SFI...
మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దేశవ్యాప్తంగా కరోనా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను రద్దు చేయాలని ఈరోజు జూలూరుపాడు మండల తాహశీల్దార్ కి డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం విజృంభిస్తున్న కోవిడ్-19 అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నూతనంగా ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని అన్నారు. ఎంతో మంది నిరుపేదలు, వృద్ధులు, దీనివల్ల వాళ్లకు దక్కాల్సిన టీకా దక్క లేకపోతుందని అన్నారు. స్మార్ట్ ఫోన్ లేనివారు మీసేవ ఇంటర్నెట్ ల వద్ద భారులు తీస్తున్నారని అన్నారు. ప్రభుత్వమే గుర్తించి 45 ఆపై ఉన్నవారికి నేరుగా టీకా ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వాలని కోరారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి మారకపోతే ఉద్యమ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎం.శివ పి. పవన్ వై కిరణ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: