మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన జునైద్ అక్రమ్ ఇటీవల తాను కనిపెట్టిన మాడిఫైడ్ మాన్ హోల్ సిస్టం ద్వారా రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి కి ఎంపిక అయిన విషయం విదితమే.ఈ విషయం తెలుసు కున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క రాజుపేట చిచ్చర పిడుగు బాల మేధావి జునైద్ అక్రంను పరామర్శించి ఇంకా మంచి,మంచి ఆవిష్కరణ లు చేయాలనీ, మోడిఫైడ్ మాన్ హోల్ సిస్టం ఆవిష్కరణ ద్వారా భవిష్యత్లో ఒక్క మరణం కూడా సంబవించదని, ఇటువంటి అద్భుతమైన ఆలోచన ఆవిష్కరణలకు మా సహాయం ఎప్పుడు ఉంటుంది అని ఈ సందర్బంగా తెలియజేసారు. జునైడ్ అక్రం తో చదువు గురించి ఆసక్తికర అంశాలు చర్చించి నీవు భవిష్యత్ లో మంచి శాస్త్రవేత్తవు అవుతావని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చదువును నిర్లక్ష్యం చేయకూడదు అని దిశ నిర్దేశం చేసి జునైద్ అక్రం ను దీవించి శాలువా కప్పి ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్బంగా గ్రామ, మండల కాంగ్రెస్ నాయకులు కూడా జునైడ్ ను ప్రశంసలతో ముంచెత్తారు.ఈ సందర్బంగా జునైడ్ అక్రం మాట్లాడుతూ సాక్షాత్తు ఎమ్మెల్యేచే సత్కారం అందుకోవటం చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తు లో ఇంకా మంచి స్థాయి రావడానికి కృషి చేస్తానని తెలియజేసారు.
Post A Comment: