మన్యం టీవీ, అశ్వరావుపేట:
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో పొంగులేటి అభిమాని జక్కుల రాంబాబు స్థానిక రక్షకభట నిలయంలో గురువారం నాడు పోలీస్ సిబ్బందికి ఐదు లీటర్ల శానిటైజర్ డబ్బా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జక్కుల రాంబాబు మాట్లాడుతూ నిరంతరం ప్రజా రక్షణ కొరకు పాటుపడుతున్న రక్షకభటులకు మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ట్రస్టు ద్వారా శానిటైజర్ అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ధ్వని రిపోర్టర్ ఉదయ్ రాఘవేంద్ర, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ మూర్తి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: