మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లో పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మండల ప్రత్యేక అధికారి సుధాకర్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. మండలంలోని వెంగన్నపాలెం గ్రామపంచాయతీ లో మొక్కల సంరక్షణ పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. వైద్యాధికారి డాక్టర్ వీరబాబు తో సమావేశమై వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలు తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. మండలంలోని వినోబా నగర్ గ్రామం వద్ద ఏర్పాటుచేసిన అంతర్ జిల్లా చెక్ పోస్ట్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ రామారావు, మండల ఇంజనీర్ శివలాల్ పాల్గొన్నారు.
Post A Comment: