మన్యంటీవీ,అశ్వారావుపేట:
పది ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులకు 2021- 22 విద్యా సంవత్సరానికి గానూ అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందుటకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎ.సాగర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీ.ఈ.సీ, హెచ్.ఈ.సీ గ్రూపులు ఆంగ్ల, తెలుగు భాషల్లో ఉన్నట్లు తెలిపారు. ఉచిత విద్యతో పాటు పాఠ్యపుస్తకాల పంపిణీ ఉంటుందన్నారు. కొవిడ్ -19 నిబంధనలు పాటిస్తూ తరగతుల నిర్వహణతో పాటు త్వరలోనే ఆన్లైన్ తరగతులను ప్రారంభించనున్నట్లు సాగర్ తెలిపారు.
Post A Comment: