౼కరోనా బాధితులకు అండగా ప్రాణీక్ హీలింగ్ ఫౌండేషన్
౼ బియ్యం,నిత్యావసరాలు పంపిణీ
మన్యం టీవీ,కరకగూడెం: నిరుపేద ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి వారికి అండగా నిలిచే ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని పద్మాపురం,మొగలితోగు గ్రామాలకు చెందిన సుమారు15మంది నిరు పేద కరోనా బాధితులకు ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం,గుడ్లు,నిత్యావసరాలను ఫౌండేషన్ సభ్యులు,గ్రామీణ వైద్యుడు షేక్ సోందు పాషా వారి కుటుంబ సభ్యులకు వారి వారి ఇంటి వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పేద ప్రజల అవసరాలను గుర్తించి.. వారి ఆకలిని తీర్చడమే మా లక్షమని పేర్కొన్నారు.అదేవిధంగా విధిగా ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మనమందరం నడుం బిగించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని కోరారు..
Post A Comment: