CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు

Share it:

 


*80 వాహనాలు సీజ్.

 *524 మందిపై కేసులు.

*203 స్పాట్ చలానా జరిమానా.

మన్యం టీవీ ఏటూరు నాగారం:

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జీవో నెంబర్ 102 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12న లాక్ డౌన్ విధించగా ఉదయం 10 గంటల తర్వాత ఏటూరు నాగారంలో నిబంధనలు అతిక్రమించిన 524 మందిపై కేసు నమోదు చేసి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా విధించే మన్నారు. అంతేకాకుండా 80 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. మోటార్ వాహన చట్టం ప్రకారం 203 స్పాట్ చలానా ద్వారా ఒక లక్ష ఒక వెయ్యి 500 జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం విధించిన నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు మాస్కు ధరించి సామాజిక దూరం పాటిస్తూ అనవసరంగా బయట తిరగవద్దు అని అన్నారు. మీ ఆరోగ్యం కోసం పనిచేసే పోలీసు శాఖ వారికి సహకరించి కోవిడ్ నియంత్రణ లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏటూరు నాగారం సెకండ్ ఎస్ఐ శ్యామ్, ప్రొబేషనరీ ఎస్ఐ చరణ్ సివిల్ సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: