ఎల్లాపురం గ్రామస్తులకు అందజేసిన పొట్లపల్లి సర్పంచ్
మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం పోట్లపల్లి పంచాయతీ ఎల్లాపురం గ్రామంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు రేగా విష్ణుచారిటబుల్ ట్రస్ట్ ద్వారా25 కుటుంబాలకు ఒక్కొక కుటుంబానికి25 కేజీల బియ్యం, 500 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ కళ్యాణి మాట్లాడుతూ విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు ఆర్థికంగా సహాయం అందిస్తున్న ప్రభుత్వ విప్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పంచాయతీలను అభివృద్ధి పరచడంతో పాటు, కరోనా కష్టకాలంలో ప్రజలను ఆర్థికంగానూ ఆదుకుంటున్న గొప్ప వ్యక్తి రేగా కాంతారావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోట్లపల్లి ఉప సర్పంచ్ కస్తూరి లింగయ్య , వార్డ్ నెంబర్ తోలెం కృష్ణ , షెర్పా అనిత తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: