👉అనాధాశ్రమం విద్యార్థులకు రెండు నెలలకు సరిపడా బియ్యం,నిత్యవసర సరుకులు వితరణ
మన్యం టీవీ,బూర్గంపాడు:
భద్రాచలం చర్ల రోడ్డులోని కహల్ అనాధ ఆశ్రమానికి నిత్యవసర సరుకులు లేక చిన్నారులు ఆకలితో అలమటించే దుస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకుని... ఎన్నారై జక్కుల సురేష్ ఆశ్రమ విద్యార్థులకు రెండు నెలలకు సరిపడా సరుకులు 50 కేజీల బియ్యం,5 లీటర్ల మంచి నూనె, కందిపప్పు,నిత్యావసర సరుకులు అందించారు. ఆశ్రమం లో మొత్తం 14 మంది చిన్నారులు ఉండగా.. వారితో ఫోన్లో మాట్లాడి భవిష్యత్తులో ఏమైనా సమస్యలు ఉంటే సహాయం చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో అశోక్,విజయ్,సాయి, దర్గయ్య,నవీన్,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: