ఉట్నూర్ మన్యం టీవీ ప్రతినిధి.
ఈరోజు గుప్పుడ్ బండ ఉద్యమకారులు కోటనక బాబురావు మరణం గోండ్వాన ఆదివాసీ సమాజానికి తీరని లోటు.ఆయన నక్షల్ ఉద్యమాల కంటె ముందు ఆదివాసీ సమాజంలో జరుగుతున్న అన్యాయలు ఎదిరించి అరక పట్టి పొరక పట్టి శిస్తును వసూలును నిరసిస్తూఉద్యమం చేసి రద్దు చేయించిన మహానుబవుడు.గిరిజన భూములను స్వాధీనం చేసుకున్న ఇతరులను నుండి 1/70 చట్టం రూపకల్పనకు ఉద్యమాలు లేవనెత్తారు.అనేక వ్యవసాయ భూములను గిరిజనులకు అప్పగించారు. తన ఉద్యమం గుప్పుడ్ బండ యే తన ఆయుధముగా ఉద్యమాన్ని నడిపారు.తిర్యాని మండల పరిషత్ అధ్యక్షులుగా పదవిని చేపట్టారు. కోటనక బాబురావు తన శ్వాశ ఆశ ఆదివాసీ సమాజం కోసం నిరంతరం కృషి చేశారు. అనేక మంది గిరిజనులను అన్యాయాలను అక్రమాల బంధాలు నుంచి విముక్తి చేశారు.అటవీ అధికారులతో గిరిజన అటవీ హక్కుల కోసం స్వతంత్ర అనంతరము ఉద్యమాల బాట చేపట్టిన మహనాయకులు.మీ ఆశయం ఆశ నిరాశ కాకుండా నిరంతరం సూర్యుడులా ఉదయిస్తూనే ఉంటుంది. మీకు ఈ సమాజం అంత ఘనముగా శ్రద్ధాంజలి ఘటిస్తుంది.
Post A Comment: