మన్యం టీవీ ఏటూరు నాగారం:
ములుగు మండలంలోని కొత్తూరు గ్రామంలో కరోనా బాధితులకు నిత్యవసర సరుకులు బియ్యం, పప్పు, నూనె, మాస్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా రెండో దశ తీవ్రతరం అవుతుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని భౌతిక దూరాన్ని పాటిస్తూ తరిమికొట్టాలని అవసరం అయితే తప్ప ఇంట్లో నుండి బయటకు రాకుండా జాగ్రత్త వహించాలి. అలాగే తప్పకుండా మాస్కులు ధరించాలని అన్నారు. కొత్తూరు గ్రామంలో ఇటీవల మరణించిన కొర్ర సది, కంచే కుమారస్వామి కుటుంబాలను పరామర్శించిన నిత్యవసర సరుకులు అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు భానోత్ రవిచందర్, మండల అధ్యక్షులు ఎండి చాంద్ పాషా, స్థానిక సర్పంచ్ వెంకటస్వామి, జిల్లా నాయకులు మారుతి నేని రవీందర్, గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు మధు, మేడం కరుణాకర్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు మామిడిశెట్టి కోటి, మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు పసుల అజయ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: