షాట్ సర్క్యూట్ కారణం అంటున్న గ్రామస్తులు
బాధితకుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క
మన్యం టీవీ మంగపేట
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం సినిమాల వీధిలో గల ఆకుల బాయమ్మ ఇల్లు ప్రమాదవశాత్తు మంటలు మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేక పోవడంతో ఇంట్లో ఉన్న సామాన్లు పూర్తిగా కాలి పోయినవి.
చుట్టుపక్కల ఉన్న యువకులు నూకల రాజేష్ ,చిరుత రథం రాజబాబు ,డిజె రాజేష్, బత్తుల రాంబాబు మంటలను ఆర్పారు కానీ అప్పటికే ఇంట్లో ఉన్న బీరువా,టి.వి ,మంచాలు, ఇతర వంట సామాన్లు ,ఫ్యాన్స్ ,బట్టలు మొదలైన సుమారు లక్ష రూపాయల వస్తువులు కాలి బుడిదయ్యాయి అని వారు వాపోయారు.అటుగా వెళ్తున్న సీతక్క
సమాచారం తెలుసుకొని సంఘటన స్థలంకు చేరుకొని ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు.అనంతరం వారు కుటుంబానికి 50 కేజిల బియ్యం,నిత్యవసర సరుకులు ఇచ్చి స్థానిక ఎమ్మార్వో కు సమాచారం ఇచ్చి బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తూడి బాగ్ వాన్ రెడ్డి,బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహా రావు,జీవ వైవిధ్య ప్రధాన కార్యదర్శి వేమ రవి,పి. ఈ. టీ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: