ములుగు ఎమ్మెల్యే సీతక్క....
మన్యం టీవీ మంగపేట.
మంగపేట రైతు సేవా సహకార సంఘం అకినేపల్లి మల్లారం డైరెక్టర్ చెట్టుపల్లి సురేష్ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని అకినేపల్లి మల్లారం లో సురేష్ కుటుంబాన్ని పరామర్శించి భార్యా బిడ్డలను ఓదార్చారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, సురేష్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో చురుకుగా పని చేసిన చెట్టు పల్లి సురేష్ భౌతికంగా మన మధ్య దూరం కావడం ఎంతో విషాదకరం అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మైల జై రామ్ రెడ్డి జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి నాగిరెడ్డి దూళిపాల బాలకృష్ణ బోడెంపూడి.రాఘవరావు, లక్కీ.వెంకన్న, దూలగొండ.నారాయణ,సురేష్ కుటుంబ సభ్యులు సహజ, వెంకటేశ్వర్లు రాజు బాలు వంశీ ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: