మన్యం మనుగడ,పినపాక:
వారిద్దరు ప్రేమించుకుని పెళ్లి
చేసుకుందామనుకున్నారు. పెళ్లి తంతుకు కులాలు వేరు కావడంతో ఇరుకుటుంబాల వారు అడ్డుకోవడంతో కథ మలుపు తిరిగింది. ఈక్రమంలో ప్రియుడు ఇంటి నుంచి కనబడకుండా వెళ్లిపోగా, ఆ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. చివరికి గ్రామ పెద్దల జోక్యమా అని, ఉత్కంఠతకు తెరపడింది. ప్రేమికులు ఇరు కుటుంబాలు, గ్రామ పెద్దల సమక్షంలో తహసీల్దార్ కార్యాలయం లో పోలీసుల ఆధ్వర్యంలో ఒక్కటయ్యారు.వివరాలు లోకి వెళితే పినపాక మండలం కు చెందిన దొడ్డ శరత్ , వాణి లు గురువారం
పోలీసులను ఆశ్రయించినారు. సీఐ దోమల రమేష్, ఎస్ఐ టివిఆర్ సూరిలు ఇరు కుటుంబాలను స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం తాహసిల్దార్ కార్యాలయంలో విక్రమ్ కుమార్ , ఎస్ఐ టి విఆర్ సూరిలు
గ్రామస్తులు సమక్షంలో పెళ్లి చేయడంతో కథ సుఖాంతమయింది. గ్రామస్తులు, కులసంఘాల నాయకులకు, ప్రజా ప్రతినిధులకు శరత్, వాణిలు కృతజ్ఞతలు తెలియజేశారు .
Post A Comment: