మన్యం టీవీ : జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
జూలూరుపాడు లో కరోనా ఐసోలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండలంలోని పడమట నర్సాపురం గ్రామపంచాయతీలో కరోనా బాధితులను కలిసి వారికి కావలసిన మందులను, పండ్లను, అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతం కావడంతో తగు వసతులు లేక కరోనా మహమ్మారి బారిన పడిన బాధితులు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చిన్న చిన్న ఇల్లు కావడంతో కుటుంబ సభ్యులందరూ ఆ ఇంట్లోనే సర్దుకునే పరిస్థితులు ఉన్నందున ఈ మహమ్మారి మరింత విస్తరించే అవకాశం ఉంది అన్నారు. సోమవారం జాతీయ యువశక్తి జై ఆదివాసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్రం నర్సింహా రావు కరోనా వచ్చి ఊరిబయట పొలంలో చిన్న పూరి పాక వేసుకుని ఓం ఐసోలేషన్లో ఉంటున్న వారిని కలిసి వారికి మందులను, పండ్లు, శానిటైజర్, మాస్కులను, అందజేశారు. ధైర్యంగా ఉండమని చెప్పి తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి వారి ఈ దుస్థితికి (పొలం లో చిన్న పూరిపాక )లో ఉండటాన్ని చూసి ఆవేదన చెందారు. జూలూరుపాడు మండలం లో ఎన్నో కరోన
కేసులు వస్తున్న మండల కేంద్రంలో కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యకపోవడం బాధాకరం అన్నారు. కట్రం నరసింహారావు కుటుంబంలో చిన్నపిల్లలు తల్లిగారు ఉన్నందువల్ల వారి ది చిన్న ఇల్లు కావడంతో చేసేది లేక ఇలా ఊరి బయటికొచ్చి తన పొలంలో ఉన్న పాకలో ఉంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జూలూరుపాడు మండల కేంద్రంలో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయ వలసింది గా కోరారు.
Post A Comment: