మన్యం టీవీ, అశ్వాపురం:
అశ్వాపురం మండల కేంద్రంలోని చిన్న తండాకు చెందిన ఒక మహిళ కరోనాతో మృతి చెందింది..కానీ ఆమెను దహనం చేయడానికి ఎవరూ కూడా ముందుకు రావడం లేదు.. విషయం తెలుసుకున్న అశ్వాపురం పంచాయతీ ఉప-సర్పంచ్-ప్రముఖ న్యాయవాది భూక్యా చందు లాల్ మరోసారి మానవత్వం చాటుకొని ప్రజల మనన్నలు పొందారు..ఇటీవల మండలానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త చందా వెంకటేశ్వర్లు కూడా కరోనాతో మృతి చెందగా దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించారు..వీరికి సంహరించిన పంచాయితీ పారిశుద్ధ్య కార్మికుడు నల్లగట్ల ప్రశాంత్ మరియు జేసీబీ యజమాని పరుచూరి రాకేష్ గారిని పలువురు అభినందించారు.
Post A Comment: